ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దశాబ్ద కాలం తరువాత నిండిన అబ్బిరెడ్డిపల్లె.. - imigration in kurnool district latest news update

వర్షాలు లేక.. సాగు, తాగేందుకు నీరు లేక.. చేసేందుకు పనులు లేక వలస వెళ్లటమే వారికి తెలిసిన పనిగా మారిపోయింది. దశాబ్ద కాలంగా ఒట్టిపోయిన చెరువు.. కొంత కాలంగా ఏకధాటిగా కురిసిన వర్షాలకు జలసిరితో కళకళలాడుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. రైతులంతా సాగుకు సన్నందం కావటంతో వలసలు ఆగిపోయి.

Abbireddypalle pond filled water after a ten years
దశాబ్ద కాలం తరువాత నిండిన అబ్బిరెడ్డిపల్లె

By

Published : Dec 13, 2020, 12:10 PM IST

కర్నూలు జిల్లాలోని డోన్ ప్రాంతంలో వర్షాలు తక్కువగా కురుస్తుంటాయి. చాలా గ్రామాల్లో తాగునీటికి సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఫలితంగా ఇక్కడి ప్రజలంతా.. గుంటూరు జిల్లాకు వలస వెళ్తుంటారు. అక్కడ కూలిపని చేసి.. సంపాదించిన డబ్బుతో.. కుటుంబాన్ని నెట్టుకొస్తారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరగటం సహా.. డోన్ మండలంలోని అబ్బిరెడ్డిపల్లె చెరువు జలకళ సంతరించుకుంది. దీంతో 15 గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు తీరనున్నాయి.

ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో పంట సాగైంది. అబ్బిరెడ్డిపల్లె చెరువు కింద ధర్మారం, డోన్, వెంకటాపురం, అబ్బిరెడ్డిపల్లె, ఎర్రగుండ్ల, మల్లెంపల్లి, గుమ్మకొండ, కర్లకుంట, జగదుర్తి, లక్ష్మింపల్లి తదితర గ్రామాల పొలాలు ఉన్నాయి. ఈ చెరువు కింద గ్రామాల ప్రజలు ఒకప్పుడు రెండు పంటలు పండించేవారు. కొంత కాలంగా ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో పక్క ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత.. ఈ చెరువు నిండటం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక పంట వేశారు. రెండో పంటకు సైతం నీరు వస్తుందని.. ఆనందంతో ఉన్నారు.

ఇదే ప్రాంతం నుంచి హంద్రీనీవా కాలువ వెళ్తోంది. కాలువ నుంచి నీటిని విడుదల చెసి అబ్బిరెడ్డిపల్లి చెరువును నింపేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవటం గమనర్హం. హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో.. ఈ చెరువును నింపితే.. స్థానికంగా 15 గ్రామాలకు మేలు జరుగుతుందని.. తాగు, సాగు నీటి సమస్యలతో సహా వలసలు ఆగిపోతాయని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చూడండి...

అవుకు ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABOUT THE AUTHOR

...view details