ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితురాలు మోసం చేసిందని పోలీస్​స్టేషన్‌లోనే  మహిళ ధర్నా - karnool police station latest news updates

అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిన ఓ మహిళకు స్నేహితురాలు మొండిచేయి చూపింది. న్యాయం చేయాలని పోలీసుస్టేషన్​కు వెళ్లినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో... ఇద్దరు పిల్లలతో సహా అక్కడే బైఠాయించింది.

A woman fight for justice in front of the police station
న్యాయం కోసం పోలీస్​స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ

By

Published : Jan 6, 2020, 11:58 AM IST

Updated : Jan 10, 2020, 11:25 AM IST

న్యాయం కోసం పోలీస్​స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనసూయ అనే మహిళ తన స్నేహితురాలు పద్మావతికి 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. చాలా రోజులు కావడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఎంత అడిగినా స్నేహితురాలు స్పందించకపోయేసరికి మూడో పట్టణ పోలీసు స్టేషన్​ను ఆశ్రయించింది. అక్కడికి వచ్చిన పద్మ అప్పు ఏమీ తీసుకోలేదని చెప్పేసరికి అనసూయ మనస్తాపానికి గురైన అక్కడే బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

Last Updated : Jan 10, 2020, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details