కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.... భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల చాంద్ బడాకు చెందిన అబ్దుల్ సలాం ఓ వ్యాపార దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మద్యం తాగాలని తన భార్యను రూ.50 అడిగాడు. ఆమె ఇవ్వకపోవటంతో బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
భార్య రూ.50 ఇవ్వలేదని... భర్త ఆత్మహత్యాయత్నం - కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యక్తి ఆత్మహత్యయత్నం వార్తలు
మద్యానికి భార్య డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆసుపత్రిలో ఆత్మహత్యయత్నం చేసుకున్న వ్యక్తి
Last Updated : Nov 18, 2019, 7:26 AM IST