ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2020, 7:52 PM IST

Updated : Jan 1, 2020, 11:24 PM IST

ETV Bharat / state

వీరు చాలా పొదుపు వ్యక్తిలా ఉన్నారు..!

బైక్​పై త్రిబుల్ రైడింగ్ వెళ్లడమే తప్పు. వెళ్లొద్దు... ప్రమాదం. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురు చిన్నపిల్లలను తన బైక్​పై ఎక్కించుకున్నాడు. తనతో కలిపి ఏడుగురు. ముందు.. వెనకా.. కావల్సిన వాళ్లు ఉండాలనే పెద్దల మాటకు కట్టుబడి ఉన్నట్టున్నాడు. ఇంతకీ ఇదెక్కడి ఫొటో అంటే..?

6 childres on one bike
6 childres on one bike

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి చాలా పొదుపు మనిషి ఉన్నట్టున్నాడు. ముందు ఇద్దరు.. వెనకొ నలుగురు చిన్నపిల్లలను బైక్​పై ఎక్కించుకున్నాడు. దర్జాగా నడిరొడ్డుపై షికార్లు కొడుతున్నాడు. పైగా హెల్మెట్ లేదు. కాస్త పట్టుతప్పిన ఏం జరుగుతుందో ఊహించడానికి భయంగా ఉంది. ఏదైనా జరిగితే.. ఏడవడం తప్ప చేసేదేముంది. అలా వెళ్లడం పిల్లలకు సరదా కావొచ్చు. ఆ సరదాను ప్రాణాలమీదకు తెచ్చే పని చేయడం తప్పు. ట్రాఫిక్ రూల్స్​ అంటూ.. చెప్పే మాటలు నోటికే పరిమితవుతున్నాయి. ప్రాణాల మీదకు తెచ్చేలా.. బైక్​పై రాజుల స్వారీ చేస్తున్న మీకు దండాలు. ఈ ఫొటో కర్నూలు జిల్లా ఆదోనిలోనిది.

Last Updated : Jan 1, 2020, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details