ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్కటి కాదు.. 20 హైదరాబాద్‌లు తయారుచేస్తా' - కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని  సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 26, 2019, 5:54 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
మైనార్టీల రక్షణకు అండగా నిలుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇమాం, మౌజంలకు ఇస్తున్న గౌరవ వేతనం రెండింతలు చేస్తామన్న సీఎం..పెళ్లికానుక కింద భవిష్యత్తులో అందరికి లక్ష రూపాయలు ఇస్తానని ఆళ్లగడ్డ సాక్షిగా హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. జగన్‌ వస్తే యువతకు ఉద్యోగాలు రావన్న బాబు.. జగన్‌ను చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు రక్షణ ఉండాలంటే మోదీ ఇంటికెళ్లాలన్నసీఎం... మోదీని ఎదుర్కొన్న సింహం.. ఫరూక్‌ అబ్దుల్లా అని అభివర్ణించారు.
సంపద సృష్టించి.. పేదప్రజలను ఆదుకుంటానని మాట ఇచ్చిన సీఎం..జగన్‌ కేసుల వల్ల మోదీ, కేసీఆర్​కు ఊడిగం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేసిన బాబు... ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల సహా పలు నగరాల్ని హైదరాబాద్​కు దీటుగా తీర్చిదిద్దుతానన్నారు.

ఇవి కూడా చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details