ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 18, 2019, 8:58 PM IST

ETV Bharat / state

బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు

అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్ష విధించే 'దిశ'గా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నా... దారుణాలు ఆగటం లేదు. కర్నూలు జిల్లాలో 11 సంవత్సరాల బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

raped
ప్రతీకాత్మక చిత్రం

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పదకొండు సంవత్సరాల బాలికపై ఫకీరప్ప అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగిందని బాలిక తల్లిదండ్రులు ఇవాళ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details