ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 6:45 PM IST

ETV Bharat / state

'అచ్చెన్నాయుడు నిజాలు చెబితే.. చంద్రబాబు, లోకేశ్ జైలుకే'

అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంలో తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలపై వైకాపా నాయకులు స్పందించారు. అచ్చెన్నాయుడిని హత్య చేయడానికి ప్రభుత్వం చూస్తోందని తప్పుడు ప్రచారం చేయడం తగదని విజయవాడలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు.

అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందన
అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందన

తెదేపా నేత అచ్చెన్నాయుడిని అర్థరాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు జరిగిన యత్నంపై... తెదేపా చేసిన చేసిన వ్యాఖ్యల విషయంలో వైకాపా స్పందించింది. అచ్చెన్నన్ను హత్య చేయడానికి ప్రభుత్వం చూస్తోందని తప్పుడు ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడలో అన్నారు. అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారని తెలిసి మంచి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని తెలియజేశారు.

ఆయన త్వరగా కోలుకోవాలని తాము కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు నిజాలు చెబితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ప్రజావేదిక వద్ద ఆందోళనకు తెదేపా నేతలు వెళ్లడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించినందునే కూల్చివేశారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తెదేపా నేతలు రాద్దాంతం చేయడం తగదన్నారు. తెదేపాకు చేతనైతే నవరత్నాల హామీలు అమలు చేయలేదని నిరసన చేపట్టాలంటూ.. సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details