ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరువూరులో బావిలో పడి యువకుని మృతి - krishna district

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా తిరువూరులో జరిగింది. దాహం తీర్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన యువకుడు కాలుజారి అందులో పడిపోయాడు.

krishna district
బావిలో పడి యువకుడు మృతి

By

Published : Apr 23, 2020, 8:24 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లిలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోట హరీష్(20) పొలం పనికి వెళ్లి దాహం తీర్చుకునేందుకు సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. గ్రామస్థులు అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసి.. ఇంటికి చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details