ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 10, 2020, 4:17 PM IST

ETV Bharat / state

'హైదరాబాద్ పారిపోకుండా... ఆధారాలు చూపాలి'

అక్రమాలకు పాల్పడిన 40 మంది వైకాపా ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై... వైకాపా నేత జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేసి హైదరాబాద్ పారిపోకుండా... ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

YCP Leaders Fires on Lokesh over comments on MLAs
జోగి రమేశ్

అవినీతి, అక్రమాలకు పాల్పడిన 40 మంది వైకాపా ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామన్న తెదేపా నేత నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. సవాల్ చేసి హైదరాబాద్ పారిపోకుండా... ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా ఇబ్బంది ఉన్నా సరే ప్రజల కోసం వైకాపా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని.. విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

"లోక జ్ఞానం లేని లోకేశ్... రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు" అన్న జోగి రమేశ్.. రాజారెడ్డి రాజకీయాలు చేసినప్పుడు లోకేశ్ పుట్టలేదన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు, లోకేశ్​కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైకాపా ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతిని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details