ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ నిబంధనలకు నీళ్లు.. వైకాపా నేతల ప్రమాణ కార్యక్రమం - పామర్రులో కొవిడ్ నిబంధనలు పాటించని వైకాపా నేతల వార్తలు

కృష్ణా జిల్లా పామర్రును అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే వైకాపా నాయకులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరి మార్కెట్ యార్డు నూతన ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ycp leaders dont follow covid rules in pamarru krishna district
ఆర్భాటంగా మార్కెట్ యార్డు కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

By

Published : Jul 3, 2020, 9:33 AM IST

కృష్ణా జిల్లా పామర్రులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అయితే వైకాపా నాయకులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.

మార్కెట్ యార్డు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీ చేసి, మాస్కులు లేకుండా, గుంపులుగా ఫొటోలు దిగారు. నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం కొవిడ్ నిబంధనలు పట్టించుకోలేదు. సామాన్యులకే కానీ అధికార పార్టీ నేతలకు నిబంధనలు వర్తించవా అంటూ పలువురు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details