ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం !

By

Published : Jun 19, 2020, 5:31 PM IST

ముళ్లపొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వద్ద చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్​టీం సహాయంతో విచారణ చేపట్టారు.

ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం !
ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం !

కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వద్ద ముళ్లపొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న అవనిగడ్డ పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్​టీం ద్వారా దర్యాప్తు వేగవంతం చేశారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details