ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో మహిళల సొంతింటి సంబరాలు - కృష్ణా జిల్లా వార్తలు

విజయవాడలో మహిళలు సొంతింటి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ఇతర ఆటవిడుపు క్రీడలు నిర్వహించారు.

మహిళల సొంతింటి సంబరాలు
మహిళల సొంతింటి సంబరాలు

By

Published : Dec 22, 2020, 5:14 PM IST

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని స్థానిక మహిళలు సొంతింటి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ఇతర ఆటవిడుపు క్రీడలు నిర్వహించారు. ఈ నెల 25 తేదీన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమం చరిత్రలో మిగిలిపోతుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మహిళలు వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details