ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా వలస కూలీల సమస్యలను పరిష్కరిస్తాం: వాసిరెడ్డి పద్మ - కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ వార్తలు

కరోనా వేళ మహిళా వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులతో చర్చించారు. వలస కూలీల అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

women commission
women commission

By

Published : Jul 23, 2020, 10:34 PM IST

కొవిడ్ సమయంలో మహిళా వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి.. ఇంటర్నెషనల్ జస్టిస్ మిషన్​తో కలిసి వెబ్​నార్ నిర్వహించారు. మహిళా వలస కూలీల అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మహిళలకు స్థానిక అవసరాలకు తగ్గట్లుగా.. ఉపాధి పనుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

మహిళా కూలీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అక్రమరవాణా చేయకుండా చర్యలు చేపడుతుమని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న మహిళలను రక్షించేందుకు మహిళా కమిషన్ పలు చర్యలు చేపట్టిందని వివరించారు.

ఇదీ చదవండి:కార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ మూడు జిల్లాల్లోనే అధికం

ABOUT THE AUTHOR

...view details