ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ అరెస్టును నిరసిస్తూ మహిళ ఆందోళన - షేర్ మహమ్మద్ పేటలో మహిళ ఆందోళన

కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్​పేటలో... వైకాపా నాయకులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ... తన కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేయించారని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసనకు దిగారు.

మహిళ నిరసన

By

Published : Nov 20, 2019, 8:02 PM IST

మహిళ నిరసన

ఇసుక అక్రమ రవాణా కేసులో తన కుమారుడిని అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ... కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్​పేటలో ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. గ్రామ సమీపంలో ఇసుక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి... వైకాపా నాయకులు వ్యాపారం చేస్తున్నారని ఆ మహిళ ఆరోపించారు. వైకాపా నేతలు ఇసుకను తరలిస్తూ... తన కుమారుడిని అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన ప్రధాన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో... ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details