తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. తనలో కమ్యూనిస్టు డీఎన్ఏ ఉన్నప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకే భాజపాలో చేరాల్సి వస్తుందని మీడియా చిట్చాట్లో భాగంగా వెల్లడించారు. ఒక వ్యవస్థతో వ్యక్తి పోటీ పడటం సాధ్యం కాదన్నారు. ముందు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే తెరాస రూ.50 కోట్లు ఖర్చు చేసింది..
తనను ఓడించడమే లక్ష్యంగా తెరాస ఇప్పటికే హుజురాబాద్లో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా, తెరాస మధ్య ఉన్న సంబంధమేంటని ప్రశ్నించినట్లు ఈటల పేర్కొన్నారు. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్తో భేటీ అయినట్లు వివరించారు.