ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముత్యంలా మెరిసింది.. ఆ చేప..!

ఆక్వేరియాలలో మాత్రమే మనం తెల్ల చిన్న చిన్న చేపలు చూస్తుంటాం కదా! అలాంటి చేపే.. ఆక్వేరియంలో కాకుండా.. మామూలుగా కనిపించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ముత్యంలా మెరుస్తూ.. ముచ్చటపడేలా చేసింది. కృష్ణా జిల్లాలో సందడి చేసిన ఆ చేప.. అలా ఉండడానికి కారణం.. ఏంటంటే..!

By

Published : Dec 13, 2020, 11:36 AM IST

white fish in seethanapalli due to genetic problem at krishna district
సీతనపల్లిలో తెల్ల చేప

సాధారణంగా చేపలు నలుపు, తెలుపు మేళవించిన వర్ణంలో కనిపిస్తుంటాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లికి చెందిన బత్తిన శివనాగరాజు తన రెండెకరాల చెరువులో కట్ల రకం చేపను సాగు చేశారు.

వాటిలో ఒక చేప పూర్తిగా తెల్లరంగులో ఉండి ఆకట్టుకుంది. ముత్యంలా మెరిసింది. అయితే.. ఇది జన్యుపరమైన లోపంతో వచ్చిన అల్బినో అనే వ్యాధి కారణంగానే తెల్లగా కనిపిస్తోందని కైకలూరు మత్స్యశాఖ ఏడీ వర్దన్ తెలిపారు. సూర్యకాంతిని సైతం ఆ చేప తట్టుకోలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details