ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి సంరక్షకుడినంటూ వచ్చాడు.. ఇల్లు దోచేశాడు - దంట్లగుంటలో వృద్ధ దంపతులపై దాడి చేసి నగదు, బంగారంతో పరారైన వాచ్​మ్యాన్

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం దంట్లగుంటలో నివసించే కొల్లి వెంకటప్పయ్య, వసుమతి దంపతులపై దుండగుడు దాడి చేశాడు. రోజూ వచ్చే ఇంటి సంరక్షకుడి స్థానంలో వచ్చిన అగంతకుడు.. నగదు, బంగారంతో పరారయ్యాడు.

watchman attack
వాచ్​మ్యాన్​ దాడిలో గాయపడిన వృద్ధురాలు

By

Published : Dec 12, 2020, 10:42 PM IST

రోజువారీ ఇంటి సంరక్షకుడి స్థానంలో వచ్చిన ఓ దుండగుడు వృద్ధ దంపతులపై దాడి చేసి నగదు, బంగారంతో పరారయ్యాడు. ఈ ఘటనలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం దంట్లగుంటలో నివసించే కొల్లి వెంకటప్పయ్య, వసుమతి అనే దంపతులు గాయాలపాలయ్యారు.

ఇటీవల వెంకటప్పయ్యకు పక్షవాతం రాగా.. విజయవాడలోని ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా ఇంటి సంరక్షణ కోసం వ్యక్తిని కుదుర్చుకున్నారు. అతని స్థానంలో వచ్చిన కొత్త వ్యక్తి దాడి చేయగా.. వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details