ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2020, 10:43 PM IST

ETV Bharat / state

'విజయవాడను ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోంది'

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను అదుకోకపోగా ప్రభుత్వం వారిపై పన్నుల భారం మోపుతోందని సీపీఎం మండిపడింది. నగరంలో పన్నుల మీద 27 % వడ్డీ వసూలు చేస్తున్నారని.. చెత్త మీద పన్ను వేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విజయవాడను ఆదాయ వనరుగానే చూస్తోంది : సీపీఎం నేత బాబురావు
విజయవాడను ఆదాయ వనరుగానే చూస్తోంది : సీపీఎం నేత బాబురావు

కృష్ణా జిల్లాలోని విజయవాడలో పన్నుల మీద 27 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ధ్వజమెత్తారు. చెత్త మీద పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు.

బెజవాడను ఆదాయ వనరుగానే..

వైకాపా ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థను ఒక ఆదాయ వనరుగా చూస్తోందన్నారు. ఇంటి పన్నులోనే అన్ని రకాల ట్యాక్స్​లు ఉంటాయని.. మళ్లీ చెత్తపై పన్ను వేయడం ఏమిటని బాబురావు ప్రశ్నించారు. చెత్తపై పన్ను వసూలు ఫిబ్రవరి కౌన్సిల్​లో తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారని.. ఫిబ్రవరిలో అసలు కౌన్సిల్ ఎక్కడ ఉందని నిలదీశారు.

ఎన్నికలకు వెళ్లగలదా?

చెత్త పన్ను, ఆస్తి పన్నులు పెంచుతున్నామని చెప్పి వైకాపా ఎన్నికలకు వెళ్లగలదా అని ఆయన సవాల్ విసిరారు. చట్టవిరుద్దంగా వసూలు చేస్తున్న పన్నులను ప్రజలెవరూ చెల్లించవద్దని బాబురావు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details