ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి వ్యత్యాసం.. పురోగతికి ఆటంకం: ఉపరాష్ట్రపతి

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి సంభాషించారు. దేశంలో అభివృద్ధి పోకడలపై అవగాహన కల్పించారు. గ్రామాలకు, పట్టణాలకు వ్యత్యాసం పెరగడం.. అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందన్నారు.

By

Published : Mar 14, 2019, 6:03 PM IST

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖీ

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖీ
దేశంలో గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వ్యత్యాసం పెరిగిపోతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్టణాల్లోనే కేంద్రీకృతం అవుతోందన్నారు. ఈ తీరు కొనసాగితే దేశాభివృద్ధికి సమస్యే అని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖినిర్వహించారు. జనం పట్టణాల నుంచి గ్రామాలకు మరలాలని పిలుపునిచ్చారు. అదే మహాత్మాగాంధీ అభిమతమని చెప్పారు.తోటి వారికి సాయపడటమే భారతీయ సంస్కృతి అని కొనియాడారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details