విజయవాడ రూరల్ మండలం నిడమనూరు సాయిబాబా మందిరంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనాస్థలాన్ని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఏపీలో చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసి అలజడి సృష్టించి, లబ్ది పొందేందుకు కొంత మంది చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వెలగపూడి స్పష్టం చేశారు. త్వరలో అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి... రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనపై నిజనిర్ధారణ చేస్తామని ఆయన తెలిపారు.
'అలజడి సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారు' - velagapudi gopala krishna latest news
రాష్ట్రంలో చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసి అలజడి సృష్టించి, లబ్ది పొందేందుకు కొంతమంది చూస్తున్నారని... అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ విమర్శించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనల గురించి నిజనిర్ధారణకు త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
!['అలజడి సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారు' Velagapudi RamaKrishna angry over attack on Hindu Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8821287-978-8821287-1600248983751.jpg)
వెలగపూడి గోపాలకృష్ణ