కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, కలిదిండి, మచిలీపట్నం మండలాల పరిధిలో వేదాంత సంస్థ 35 చమురు, సహజవాయువు బావులను తవ్వనుంది. అంచనా వ్యయం రూ.650 కోట్లు. ఇది ఆన్షోర్ ప్రాజెక్టు. ఈ ప్రాంతమంతా కేజీ బేసిన్లోని కాజ బ్లాక్ పరిధిలోకి వస్తుంది. దీని విస్తీర్ణం 114.93 చ.కి.మీ.లు. ఈ ప్రాజెక్టును వేదాంత సంస్థకు చెందిన చమురు, సహజవాయువు విభాగం కెయిర్న్ ఆధ్వర్యంలో చేపట్టాలన్నది ప్రతిపాదన. దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ మదింపు నివేదికను ఈకో కెమ్ సేల్స్ అండ్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డిసెంబరు 17న గూడూరు మండలం తురుకతూరులోని తుర్లపాటి కమల జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది.
జాతీయ చమురు కంపెనీలకు చెందిన, చిన్న చిన్న చమురు క్షేత్రాల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించడం ద్వారా వినియోగంలోకి తెచ్చే విధానంలో భాగంగా కాజ బ్లాక్ 2018లో వేదాంత సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ తవ్వనున్న 35 బావుల్లో మొవ్వ మండలంలో 14, గూడూరులో 18, కలిదిండిలో 2, మచిలీపట్నంలో ఒకటి ఉన్నాయి. ఈ బ్లాక్లో చమురు, సహజవాయు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు ఓఎన్జీసీ గతంలో 3 చోట్ల బావులు తవ్వింది. వాటిలో 2 చోట్ల ఏమీ లభించలేదు. రాఘవపురం ప్రాంతంలో తవ్విన బావి ద్వారా ఆ ప్రాంతంలో... సహజవాయువు ఉందని గుర్తించింది.
చమురు నిల్వలూ ఉండే అవకాశం లేకపోలేదన్న అంచనాకి వచ్చింది. ‘హైడ్రో ఫ్యాక్చరింగ్’ విధానం ద్వారా మరింతగా గ్యాస్ నిల్వల్ని వెలికి తీయవచ్చనిఅంచనా వేశారు. అప్పట్లో భూమిలో 2,300 మీటర్ల లోతు వరకు బావి తవ్వారు. కాజ బ్లాక్లో తవ్వనున్న 35 బావుల నుంచి రోజుకి 30 వేల బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ ఘనపుటడుగుల (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్) సహజవాయువు వెలికి తీయగలమని వేదాంత సంస్థ అంచనా వేస్తోంది.
ప్రాజెక్టుతో కాలుష్యమే