ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ నగరంలో 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

By

Published : Jun 2, 2019, 11:52 PM IST

సివిల్స్

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్లుగా ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు. విజయవాడలో 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా... ఉదయం పరీక్షకు 47శాతం మంది, మధ్యాహ్నం పరీక్షకు 48శాతం అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9వేల 872మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోగా... ఉదయం పరీక్షకు 4వేల 679 మంది, మధ్యాహ్నం పరీక్షకు 4వేల 780 మంది హాజరయ్యారు.

ప్రశ్నాపత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. ప్యాసేజీలు, స్టేట్ మెంట్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని.. అన్ని ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు వెల్లడించారు. స్టేట్ మెంట్ ప్రశ్నలకు సమాధానాలు చాలా దగ్గరగా ఉండడం వల్ల అభ్యర్థులు అయోమయం చెందినట్టు తెలుస్తోంది. ఆర్థికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు సైతం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details