ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాసంకల్ప యాత్రకు రెండేళ్లు.. వైకాపా నేతల సంబరాలు - two years completed for prajasankalayatra celebrations in vijayawada

ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేసి బుధవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలు చోట్ల మంత్రులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ప్రజాసంకల్ప పాదయాత్రకు రెండేళ్లు పూర్తి... సంబరాల్లో మంత్రులు,కార్యకర్తలు

By

Published : Nov 6, 2019, 9:19 PM IST

ప్రజాసంకల్ప యాత్రకు రెండేళ్లు.. వైకాపా నేతల సంబరాలు

ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని కేక్ కట్​ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంజద్ భాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలు కేకు కోసి తమ ఆనందం వ్యక్తం చేశారు.

సాలూరులో కేక్​ కట్​ చేసి సంబరాలు

విజయనగరం జిల్లా సాలూరు మెయిన్ రోడ్డు బోసుబొమ్మ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి 3 వేల 600 కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని కొనియాడారు.

ఇవీ చదవండి:

అనంతలో భాజపా గాంధీజీ సంకల్పయాత్ర.. పాల్గొన్న కన్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details