ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి - krishna district latest news

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి స్వల్పంగా షాక్ తగలడంతో వారిని శ్రీకాకుళం ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి
విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి

By

Published : Oct 23, 2020, 2:08 PM IST

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో దారుణం జరిగింది. పొలంలో పురుగు మందు పిచికారీ చేయడానికి వెళ్లిన కూలీలకు విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పమిడిముక్కల మండలం ఎట్టివానిగూడెేనికి చెందిన సీతారామంజనేయులు(30), చిన్నం అనిల్​కుమార్ గా గుర్తించారు. స్వల్పంగా కరెంట్ షాక్ తగిలిన అప్పారావు పేటకు చెందిన కళ్యాణ్​, ఎట్టివానిగూడెంకు చెందిన పిల్లి శోభనాద్రిని శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details