కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పెంటేలవారిగూడెం వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 1052 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం.. ఇద్దరు మహిళల అరెస్ట్ - తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం-ఇద్దరు మహిళలు అరెస్ట్
తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 1052 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పెంటేలవారిగూడెం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ తరలింపులో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం-ఇద్దరు మహిళలు అరెస్ట్