ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2021, 11:20 AM IST

Updated : Aug 27, 2021, 6:01 PM IST

ETV Bharat / state

COVID: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం..ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్

కృష్ణా జిల్లాలోని శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కొవిడ్ నిర్ధరణ కావడంతో.. విద్యాశాఖ అధికారులు ఇవాళ, రేపు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

corona
corona

ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మూడో దశ ముప్పు పొంచి ఉందని అంతా భయపడుతున్న వేళ.. చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పాఠశాలలు నడుస్తున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.

తాజాగా కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాఠశాలలో 30 మంది విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో.. రెండో తరగతి విద్యార్థి, ఐదవ తరగతి విద్యార్థికి కొవిడ్​ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు, రేపు పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలలో అధికారులు శానిటైజ్ చేయించారు.

పమిడిముక్కల మండలం ఆగినపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించారు. విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు ప్రధానోపాధ్యాయురాలు స్వరాజ్యలక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి:Corona cases: వరుసగా రెండో రోజూ 40వేలకు పైగా కరోనా కేసులు

Last Updated : Aug 27, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details