కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 216 జాతీయ రహదారి వద్ద కాలువ పై ఉన్న వంతెన... గత నెలలో కూలిపోగా అధికారులు పక్కనే అప్రోచ్ రోడ్డు వేశారు. లోడ్ తో ఉన్న రెండు లారీలు ఈ రోడ్డు పై వెళ్లుతుండగా పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఆ మార్గం ద్వారా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా.. అవనిగడ్డ నుంచి వెళ్లే వాహనాలను వెంకటాపురం మీదుగా చల్లపల్లి వరకు మళ్లించారు.
లారీలు ఒరిగిపోవడంతో... వాహనాల దారి మళ్లింపు - కృష్ణా జిల్లా తాజా సమాచారం
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం వద్ద లోడ్ తో వెళ్తున్న లారీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఆ మార్గం ద్వారా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా... అవనిగడ్డ నుంచి వెళ్లే వాహనాలను వెంకటాపురం మీదుగా చల్లపల్లి వరకు మళ్లించారు.

వాహనాల దారి మళ్లింపు
ఇదీ చదవండి:విశాఖలో తెదేపా కార్యాలయ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే