ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనాభివృద్ధే ధ్యేయం: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి - గిరిజనాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పుష్పా

ప్రభుత్వం గిరిజనాభివృద్దికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీసుకొస్తామని చెప్పారు.

గిరిజనాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పుష్పా

By

Published : Jul 10, 2019, 1:00 PM IST

విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఐటీడీఏ పీవోలు, ఇతర అధికారులతో మంత్రి పాముల పుష్పశ్రీవాణి సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, కమిషనర్‌ రవీంద్రబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. గిరిజనాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీవాణి అన్నారు. జీసీసీ, ఇంజినీరింగ్‌ పనుల్లో గత ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బయటకు తీసి ప్రక్షాళన చేస్తామన్నారు. గిరిజనుల వైద్యానికి ఐటీడీఏ ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజన విద్య మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details