ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదు'

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదని.. గతంలో మాదిరిగానే ఉన్నాయని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ తెలిపారు. బిల్లుల చెల్లింపుల గడువు జూన్ 15 వరకు పెంచుతున్నామని ఆయన అన్నారు.

By

Published : May 12, 2020, 7:59 PM IST

transco cmd srikanth conference on Electricity charges
ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదని.. గతంలో మాదిరిగానే ఉన్నాయని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ తెలిపారు. 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందనన్నారు. టారిఫ్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనేది అవాస్తవమని.., వినియోగదారుల బిల్లుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామనన్నారు. ఏమైనా అనుమానాలుంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఈఆర్‌సీ ఆమోదించాకే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. బిల్లుల చెల్లింపుల గడువు జూన్ 15 వరకు పెంచుతున్నామని అన్నారు. గతంలో మాదిరిగానే నిబంధనలున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details