ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2020, 1:06 PM IST

ETV Bharat / state

పోలీసుల చొరవ.. సకాలంలో ఆసుపత్రికి గర్భిణి

లాక్​డౌన్​ సందర్భంగా అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులు నెలలు నిండిన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించిన ఘటన విజయవాడలోని అజిత్​సింగ్​ నగర్​లో చోటు చేసుకుంది.

గర్భిణికి సకాలంలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు
traffic police help to pregnant lady

విజయవాడ అజిత్​సింగ్​నగర్​లోని ఒక కాలనీలో నివాసముంటున్న గర్భిణికి అర్ధరాత్రి నొప్పులు రావటంతో అంబులెన్స్​కు కాల్ చేశారు. అది రావటానికి ఆలస్యమవ్వగా.. గర్భిణి బందులువు సింగ్ నగర్ ప్రధాన కూడలిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఓ ప్రవేట్ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో అంబులెన్స్ అక్కడకు చేరుకోవటంతో గర్భణిని జీజీహెచ్​కు తరలించారు. పోలీసులకు సమాచరం ఇవ్వగానే స్పందించడంపై స్ధానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details