ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 18, 2021, 11:45 AM IST

ETV Bharat / state

శతాబ్దాల గంట.. సమయం చెబుతుందంట!

గడియారాలు , ఫోన్లు లేకుంటే మనకు సమయం ఎంత అవుతుందో తెలీదు. కానీ మన పూర్వీకుల కాలంలో వారికేం ఇలాంటి సదుపాయాలే లేవు. వాళ్లు ఎండ నీడను బట్టే..సమయాన్ని లెక్కించేవాళ్లు. ఇంకా ఊరంతా తెలిసేలా ..పెద్ద గంటను మోగించేవాళ్లు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అది ఎక్కడో చూస్తారా..!

time calculate  with bell at challapalli
గుర్వనీడుకోటలో గంట గడియారం

రాజుల కాలంలో సమయం తెలుసుకోవడానికి గడియారాలు లేవు. ఎండ నీడను బట్టి సమయం లెక్కించి, ప్రజలకు తెలిసే విధంగా గంట మోగించేవారు. ఆధునిక యుగంలో అర చేతిలోనే ప్రపంచం కనిపిస్తున్నా.. శతాబ్దాల నుంచి వస్తున్న పద్ధతులను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

కృష్ణా జిల్లా చల్లపల్లిలో అప్పటి రాజు శ్రీరాజా యార్లగడ్డ గుర్వనీడు(1576-1607) కోటలో గంట గంటకూ గంట మోగిస్తూనే ఉన్నారు. సమయం మూడైతే మూడు సార్లు, నాలుగైతే నాలుగు సార్లు గంట మోగిస్తున్నారు. శ్రీ దేవరకోట సంస్థానాధీశ్వరుల వంశవృక్షం బోర్డులో అందరి పేర్లను ఉంచారు. అప్పటి భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

ABOUT THE AUTHOR

...view details