ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నంలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు

మచిలీపట్నంలో తాజాగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మచిలీపట్నం పరిధిలో పాజిటివ్​ కేసుల సంఖ్య 21కి చేరింది.

By

Published : Jun 14, 2020, 12:01 PM IST

మచిలీపట్నంలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు
మచిలీపట్నంలో తాజాగా మూడు పాజిటివ్ కేసులు

రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తాజాగా 3 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి మచిలీపట్నం పరిధిలో కేసుల సంఖ్య 21కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని ఆర్డీవో ఖాజావలి కోరారు. బందరు పరిధిలోని హుస్సేన్ పాలెంలో ఇద్దరికి, నగరంలోని సర్కార్ తోటకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:దేశంలో 24 గంటల్లో 11,929 కేసులు, 311 మరణాలు

ABOUT THE AUTHOR

...view details