రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టులకు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది.ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న ప్రవీణ్ కుమార్ కు మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అదనపు బాధ్యతలు అప్పగించారు.గోదావరి-కృష్ణా డెల్టా కాల్వల ఆధునికీకరణ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా,శాప్ ఎండీ గా ఉన్నా కాటమనేని భాస్కర్ కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.పర్యావరణ,అటవీ,శాస్త్ర-సాంకేతిక శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శిగా కాటమనేని భాస్కర్ ను ప్రభుత్వం నియమించింది.ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.
కీలక ప్రాజెక్టులకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ కీలక ప్రాజెక్టులకు అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
The state government latest news about key projects