ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా హయాంలో రైతుల పరిస్థితి దయనీయం'

By

Published : Mar 5, 2020, 7:40 PM IST

వైకాపా హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

వైకాపా హయాంలో రైతుల పరిస్థితి దయనీయం
వైకాపా హయాంలో రైతుల పరిస్థితి దయనీయం

'వైకాపా హయాంలో రైతుల పరిస్థితి దయనీయం

జగన్‌ ప్రభుత్వ హయంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కృష్ణాజిల్లా తెన్నేరులో తెదేపా నేతలు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఉమా డిమాండ్‌ చేశారు. రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

పొత్తూరి లేని లోటు తీర్చలేనిది

పొత్తూరి లేని లోటు తీర్చలేనిది

సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల దేవినేని ఉమా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పత్రికారంగానికి తీర్చలేనిదన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. పాత్రికేయునిగా ఎన్నో మంచి కథనాలను పాఠకులకు అందించారని గుర్తు చేసుకున్నారు.

ఇదీచదవండి

సింహాచలం దేవస్థానం నూతన చైర్​పర్సన్​గా సంచయిత గజపతిరాజు

ABOUT THE AUTHOR

...view details