ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

By

Published : Oct 8, 2020, 5:47 PM IST

Updated : Oct 8, 2020, 7:04 PM IST

కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విజయవాడ పడమట శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

ప్రమాణ స్వీకారం చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
ప్రమాణ స్వీకారం చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం

కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు కొండపర్తి లీలాజయకృష్ణ, రామడు వాసులు కమిటి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

భవిష్యత్ కార్యచరణపై చర్చ..

గ్రామాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సభ్యులు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సింహాద్రి కనకాచారి, గోసంరక్షణ సమితి రాష్ట్ర నాయకులు సిరిపల్లి సిద్దార్ధ, సంఘం గౌరవాధ్యక్షులు గోవర్ధన శాస్త్రి పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

జగనన్న విద్యాకానుకతో పండగ వాతావరణం: ఉప ముఖ్యమంత్రి

Last Updated : Oct 8, 2020, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details