ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2019, 4:10 PM IST

ETV Bharat / state

'ప్రధాని మోదీకి వైకాపా అభినందనలు.. ఎందుకంటే..?'

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి... భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు వైకాపా తరఫున రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎన్​వీఎస్ నాగిరెడ్డి.. ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ నిర్ణయంతో దేశ రైతాంగం సంక్షోభంలోకి వెళ్లకుండా కాపాడారని అన్నారు.

ఆర్సీఈపీ నుంచి రైతాంగాన్ని కాపాడినందుకు మోదీకి అభినందనలు తెలిపిన వైకాపా

ఆర్సీఈపీ నుంచి రైతాంగాన్ని కాపాడినందుకు మోదీకి అభినందనలు తెలిపిన వైకాపా

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు వైకాపా తెలిపింది. ఆర్సీఈపీ పేరుతో దేశంపై ఆర్థిక దాడికి ప్రయత్నాలు జరిగాయని... ఈ ముప్పు నుంచి దేశ రైతాంగాన్ని కాపాడారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎన్​వీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఒప్పందంలో భాగమైతే... 16 దేశాల మధ్య ఎలాంటి సుంకం లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేసుకునే అవకాశం ఉండేదని.. ఈ కారణంగా దేశం, రాష్ట్రంలోని రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉండేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details