ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 7:52 PM IST

Updated : Nov 15, 2020, 8:27 PM IST

ETV Bharat / state

ఆట మధ్యలో వివాదం... రోడ్డుపై రణరంగం

కృష్ణా జిల్లా మైలవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ten people injured on quarreling in mailavaram krishna district
ఇరు వర్గాల మధ్య ఘర్షణ... 10 మందికి గాయాలు

ఇరువర్గాల ఘర్షణ... 10 మందికి గాయాలు

పాత కక్షల నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పొందుగుల గ్రామంలో... వాలీబాల్ ఆడుతుండగా చెలరేగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో భయానక వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 15, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details