ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు నిర్ణయం.. వైకాపా రాక్షస పాలనకు చెంపపెట్టులాంటిదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని నేతలు కోరారు.
'హైకోర్టు తీర్పు వైకాపా రాక్షస పాలనకు చెంపపెట్టు' - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు