ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తరాంధ్ర రైతుల సమస్యలపై తెదేపా వీడియో విడుదల - AP LATEST NEWS

నేడు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న రైతు కోసం తెలుగుదేశం నాలుగో రోజు నిరసనలో భాగంగా ఆయా ప్రాంతాల రైతు సమస్యలపై ఓ వీడియోను విడుదల చేశారు.

tdp-released-a-video-on-north-andhra-farmers-problems
ఉత్తరాంధ్ర రైతుల సమస్యలపై తెదేపా వీడియో విడుదల

By

Published : Sep 17, 2021, 9:26 AM IST

రైతుకోసం తెలుగుదేశం పోరుబాటు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతుల సమస్యలకు సంబంధించి తెదేపా ఓ వీడియోను విడుదల చేసింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న రైతు కోసం తెలుగుదేశం నాలుగో రోజు నిరసనలో భాగంగా ఆయా ప్రాంతాల రైతు సమస్యలను వీడియో ద్వారా వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 115 మండలాలు ఉండగా, వాటిలో దాదాపు 80 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వివరించింది. మొక్కజొన్న పంట బకాయిలు, జీడి రైతులకు మద్దతు ధర, వరి పంటతో కష్టాలు, నిబ్బరం కోల్పోయిన కొబ్బరి రైతు, తిత్లీ పరిహారం ఇంత వరకూ అందకపోవడం, రైతు గుండెల్లో విద్యుత్ మీటర్ల దడ, విత్తనాలు, ఎరువుల సమస్య, తదితర అంశాలపై నేడు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

tdp-released-a-video-on-north-andhra-farmers-problems

2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తే తెదేపా ప్రభుత్వం కొబ్బరి చెట్టుకు 1500 చొప్పున, జీడిపంటకు హెక్టారుకు 30 వేలు చెల్లించిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే తిత్లీ పరిహారం పెంచుతామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి... కొబ్బరి చెట్టుకు అదనంగా మరో 1500, జీడి పంటకు అదనంగా మరో 20 వేలు పరిహారం ప్రకటిస్తూ 2019 సెప్టెంబర్‌ మూడో తేదీన జీవో జారీ చేసినా... ఇప్పటి వరకూ లబ్దిదారులకు పరిహారం చెల్లించకపోడాన్ని తెదేపా తీవ్రంగా తప్పుబట్టింది. శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజన్‌లో 35 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే.. క్వింటాలుకు 1850 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా... 1400 రూపాయలకు మించి కొనుగోలు చేయట్లేదని విమర్శించింది.

జిల్లాలో 1.10 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడికి గానూ... ప్రభుత్వం 35,500 టన్నులు (32.27 శాతం) మాత్రమే కొనుగోలు పట్ల తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోనూ 30 శాతాన్నే కొనుగోలు చేశారని ఆక్షేపిస్తున్నారు. జీడి పంటకు సంబంధించి గిట్టుబాటు ధర టన్ను 14వేల రూపాయలు ఉండగా... 8వేలకు మించి ప్రభుత్వం కొనట్లేదన్నది తెదేపా వీడియోలో విమర్శనాస్త్రాలు సంధించింది.

ఇదీ చూడండి:OTS SCHEME: రుణం కట్టలేని బడుగులు..ఈ సొమ్ము కట్టగలరా?

ABOUT THE AUTHOR

...view details