ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి' - కొణతాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో 'నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకివ్వండి' అంటూ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.

tdp protest for house lands at konatalapalli
ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి

By

Published : Nov 7, 2020, 3:56 PM IST

ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. తెదేపా పిలుపు మేరకు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో తెదేపా నాయకులతో కలిసి 'నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకివ్వండి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇళ్ల స్థలాల వద్ద నిరసన చేపట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల అప్పుల పాలయ్యామని ఈ సందర్బంగా లబ్ధిదారులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details