ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చాలి: అశోక్ బాబు

By

Published : Apr 5, 2021, 7:27 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

tdp mlc ashok babu
తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

వేలమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసేశారని ఆరోపించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆగ్రహించారు. వెంటనే హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details