ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ ప్రసంగం పై తెదేపా నేతల ఆగ్రహం

గుంటూరు సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగంపై తెదేపా నేతలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమ మండిపడ్డారు. అడ్వాణీ వంటి సీనియర్ నేత నమస్కారం చేస్తే.. ప్రతి నమస్కారం చేయని వ్యక్తి మోదీ అని విమర్శించారు.

By

Published : Feb 10, 2019, 3:21 PM IST

మోదీ రాష్ట్ర పర్యటనపై నిరసనలు

సంస్కారం గురించి ప్రధాని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న ఎద్దేవాచేశారు. మోదీ దృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లుండి కూడా చూడలేని స్థితిలో మోదీ ఉన్నారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల నిధులు వెనక్కి తీసుకున్న నీచ సంస్కృతి తమదేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రధాని సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. వైకాపాతో లాలూచీ పడి మోదీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

మోదీ ప్రసంగం పై తెదేపా నేతల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details