ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శిరోముండనం కేసుపై కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ

By

Published : Aug 25, 2020, 12:19 PM IST

Updated : Aug 25, 2020, 2:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం కేసు గురించి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాష్వన్​కు... తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఆ కేసు గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని లేఖలో పేర్కొన్నారు. బాధితుడు రాష్ట్రపతికి మొరపెట్టుకున్న న్యాయం జరగలేదని తెలిపారు.

tdp leader varla ramaiah wrote letter to union minister ramvilas about tonsuring head of dalit
శిరోముండనం కేసు గురించి కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగినశిరోముండనం కేసుని పార్లమెంటులో ప్రస్తావించాలని కోరుతూ... కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాష్వన్​కు తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. అసలు ముద్దాయిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బాధితుడు రాష్ట్రపతికి మొరపెట్టుకున్న న్యాయం జరగలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

శిరోముండనం కేసు గురించి కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ

ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంటులో ప్రశ్నించిన దళిత యువకుడికి న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం జరగకపోతే తాను నక్సలైట్లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని... రాష్ట్రపతిని బాధితుడు కోరిన విషయన్ని లేఖలో పేర్కొన్నారు.

Last Updated : Aug 25, 2020, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details