ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2019, 2:51 PM IST

ETV Bharat / state

'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'

రాజధాని అమరావతిపై జీఎన్​ రావు కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జగన్​ కమిటీ అని ఎద్దేవా చేశారు. మంత్రులు సీఆర్డీఏపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'
'ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం'

సీఎం జగన్​ ప్రజల గుండెలపై తన్నారని దేవినేని విమర్శ
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రాజధాని అమరావతిని కాపాడుకుంటామని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్​ఆర్​ కమిటీ సభ్యులు రైతుల ఆగ్రహం చూసి దొడ్డిదారిన పారిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్​ తన పుట్టినరోజు సందర్భంగా ఐదు కోట్ల ప్రజల గుండెలపై తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీఆర్డీఏపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టాల గురించి అమాత్యులు తెలుసుకోవాలని సూచించారు. 29 గ్రామాల ప్రజలు రోడ్ల మీద ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే వారం నుంచి ఓ వైపు న్యాయ పోరాటం.. మరోవైపు ధర్మపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details