ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 4:58 PM IST

ETV Bharat / state

'సుప్రీం తీర్పు ఓ మైలురాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారాలి'

శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్వాగతించారు. ఈ తీర్పు ఒక మైలురాయి అన్నారు.

TDP leader chandrababu naidu respond on supreme justice on  thiruvananthapuram temple
సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయి

సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయి

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ట్రావెన్​కోర్ రాజవంశీయుల హక్కులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. రాజ కుటుంబాల ముందస్తు ఒప్పందాలు, దీర్ఘకాల సంప్రదాయాల పవిత్రతను రక్షించిందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును గ్రహించాలన్న చంద్రబాబు... సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు యాజమాన్యంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాన్సాన్ ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details