తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగా75శాతం స్థానికులకు అవకాశం ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని తెదేపా ఎమ్మెల్సీ,కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆరోపించారు.తెదేపా హయాంలో బోర్డు సభ్యునిగా శేఖర్ రెడ్డిని నియమిస్తే తప్పుబట్టిన వైకాపా,ఇప్పుడు అదే శేఖర్ రెడ్డిని ఎక్స్ అఫీషియోగా నియమించడాన్ని..ఎలా అర్దం చేసుకోవాలని ప్రశ్నించారు.సామాజిక న్యాయం ప్రకారం నియామకాలు జరుపుతామని శాసనసభ,శాసనమండలిలో చెప్పిన మాటలు ఏమైయ్యాయని ఆయన మండిపడ్డారు.
'తితిదేపై ఏం చెప్పారు..!ఇప్పుడేం చేస్తున్నారు..!' - krishna president arjunudu comments on ttd members
తితిదేలో వైకాపా ప్రభుత్వం నియమించిన 29 మంది సభ్యుల పాలకమండలిపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. సామాజిక న్యాయం ప్రకారం బోర్డు సభ్యులను నియమిస్తామన్న నేతలు, ఇప్పుడు చేసింది ఏంటని ప్రశ్నించారు.

తితిదే బోర్డు సభ్యులు
'తితిదే బోర్డు సభ్యుల నియామకాల్లో వైకాపా మాట మార్చింది'
ఇదీ చూడండి : 'ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులను దగా చేశారు'