ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో రోడ్డు వెడల్పు ప్రతిపాదనపై తెదేపా అభ్యంతరం - నందిగామ కౌన్సిల్​ సమావేశంలో రోడ్డు వెడల్పు ప్రతిపాదనను ఆమోదించని తెదేపా

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ మొదటి కౌన్సిల్ సమావేశం.. చైర్​ పర్సన్ మండవ వరలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. నందిగామలోని రోడ్డును 40 అడుగుల వెడల్పు చేయటానికి ప్రతిపాదన చేయగా తెదేపా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

nandigama, council meeting
నందిగామలో కౌన్సిల్ సమావేశం

By

Published : Mar 28, 2021, 1:58 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ మొదటి కౌన్సిల్ సమావేశం.. చైర్​ పర్సన్ మండవ వరలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అత్యవసర కౌన్సిల్ సమావేశంలో.. నందిగామలోని రోడ్డును 40 అడుగుల వెడల్పు చేయటానికి ప్రతిపాదన చేయగా తెదేపా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

'ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది'

ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తెలిపారు. రహదారి వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని, మాస్టర్ ప్లాన్లో భాగంగానే వెడల్పు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రతిపక్ష నేతల అభ్యంతరం

నందిగామలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయం భూములు తీసుకొని క్రీడాప్రాంగణం, పార్క్ ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనపై ప్రవేశపెట్టగా.. తెలుగుదేశం కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు ప్రజా సమస్యలపై చర్చించారు.

ఇదీ చదవండి:

ఆచార్య వేల్చేరుకు... కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details