"వ్యాక్సిన్ సరఫరా చేయండి - ప్రాణాలు కాపాడండి" నినాదంతో.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నిరసనలు చేపట్టనుంది. ఇళ్ల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 18 ఏళ్లు పైబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని, ఆస్పత్రుల్లో పడకల కొరత తీర్చాలని.. అవసరమైన వారికి ఆక్సిజన్ అందించి ప్రాణాపాయం నుంచి కాపాడాలని డిమాండ్ చేయనున్నారు.
అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ.. నేడు తెదేపా రాష్ట్ర వ్యాప్త నిరసన - Tdp state wide protest today by demanding supply of vaccine to All
అర్హులందరికీ వ్యాక్సిన్ సరఫరా కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. నివాసాల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా శ్రేణులు నిరసన తెలుపనున్నాయి.
వ్యాక్సిన్ సరఫరా కోరుతూ నేడు తెదేపా రాష్ట్ర వ్యాప్త నిరసన