ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గంటా నవీన్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'

గంటా నవీన్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. అతని కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు.

By

Published : Jun 21, 2020, 3:11 PM IST

tanigirala sowmya visit ganta naveen family in nandigama krishna district
గంటా నవీన్ మృతదేహాన్ని సందర్శించిన తంగిరాల సౌమ్య

కృష్ణా జిల్లా నందిగామలో హత్యకు గురైన గంటా నవీన్ పార్ధివదేహాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ హత్య వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టుల నేపథ్యంలోనే నవీన్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details