ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి - telangana road accident news

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేటలో జరిగింది. మృతుల్లో ఒకరు తాండూరు సర్పంచ్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accident in pragnapur at siddipet and three members died
తెలంగాణలో లారీని ఢీకొట్టిన కా

By

Published : Sep 3, 2020, 10:12 AM IST

తెలంగాణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని.. కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

మృతులు మంచిర్యాల జిల్లాలోని తాండూరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరైనా అంజిబాబు సర్పంచ్​ అని.... మిగిలిన ఇద్దరు అతని మిత్రులు సాయిప్రసాద్, గణేశ్​గా గుర్తించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'రాజధాని ఒకటే ఉండాలి .. అదీ రాష్ట్రం మధ్యలోనే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details